విద్యుదాఘాతంతో రైతు మృతి
ABN , First Publish Date - 2020-07-05T11:35:01+05:30 IST
విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన సంఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని అర్జున్పట్లలో చోటు చేసుకున్నది
మద్దూరు, జూలై 4 : విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన సంఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని అర్జున్పట్లలో చోటు చేసుకున్నది. గ్రామస్థుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన ముస్మీర్ బాల్రాజ్గౌడ్ (64) శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి వ్యవసాయ బావి వద్ద వాగు ప్రవహిస్తుండడంతో స్టాటరు మునిగిపోకుండా ఉండేందుకు సర్వీసు వైరు లాగాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సంపత్ తెలిపారు.