దేశానికి రైతే వెన్నెముక
ABN , First Publish Date - 2020-07-09T10:58:09+05:30 IST
దేశానికి రైతే వెన్నెముక అన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో
వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి
కలెక్టరేట్, జూలై 8 : దేశానికి రైతే వెన్నెముక అన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిన వ్యక్తి దివంగత నేత రాజశేఖరెడ్డి అన్నారు. రైతులు సంతోషంగా ఉండాలన్నదే ఆయన ఆకాంక్ష అన్నారు. రాష్ట్రంలో 10,461 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటి ద్వారా విత్తనాలు, ఎరువులు తదితర వాటిని అందిస్తున్నట్టు చెప్పారు.
కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ జె.నివాస్, జేసీ సుమిత్ కుమార్, ఎంవీ పద్మావతి, వ్యవసాయ శాఖ జేడీ కె.శ్రీధర్, మత్స్యశాఖ ఏడీ శ్రీనివాసరావు, పశుసంవర్థక శాఖ జేడీ ఎ.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.