రైతు ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం

ABN , First Publish Date - 2020-07-03T11:09:51+05:30 IST

రైతు ప్రయోజ నాలకే రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని డీసీసీ బీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు

రైతు ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం

 డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి


కోటగిరి/బాన్సువాడ/బీర్కూర్‌, జూలై 2: రైతు ప్రయోజ నాలకే రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని డీసీసీ బీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు. కోటగిరి మండ లంలోని పోతంగల్‌, హెగ్డొళీ, ఎత్తొండ, కోటగిరి, రాంపూర్‌, కొత్తపల్లి గ్రామాలలో రైతు వేదికల భవన నిర్మాణాలకు గు రువారం ఆయన భూమి పూజ చేశారు. అలాగే కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్‌, కోనాపూర్‌లో, బీ ర్కూర్‌ మండలం బీర్కూర్‌, బైరాపూర్‌, రైతునగర్‌, కిష్టాపూ ర్‌, చించొల్లిలో గ్రామాలలో రైతువేదికల నిర్మాణానికి ఆయ న భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స మావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతు ల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. రైతు లు సమావేశమై ఏఏ పంటలు పండించుకో వాలనే అంశం పై వివరించేందుకు రైతు వేదికలు ఎంతగానో ఉపకరిస్తా యని ఆయన పేర్కొన్నారు.


90 రోజుల్లోనే రైతు వేదికల ని ర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తామని ఆ యన పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథ కాలను ప్రవేశపెట్టి రైతుల కష్టాలు దూరం చేసిందన్నారు. దేశంలో రైతులకు పెట్టుబడి అందించే ఏకైక రాష్ట్రం తెలం గాణ అని ఆయన అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ బా న్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి పోచారం సురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ శంకర్‌పటేల్‌, ఏఎంసీ చైర్మన్‌ గంగాధర్‌, రైతు స మన్వయ సమితి అధ్యక్షుడు కొల్లూర్‌ కిషోర్‌, జడ్పీ కో-ఆప్ష న్‌ మెంబర్‌ సిరాజ్‌, ఎంపీపీ సునిత, వైస్‌ ఎంపీపీ గంగాధ ర్‌ పటేల్‌, సర్పంచ్‌లు, విండో అధ్యక్షులు, టీఆర్‌ఎస్‌ మండ ల అధ్యక్షుడు, ఎంపీడీవో, తహసీల్దార్‌ తదితరులున్నారు. 

Updated Date - 2020-07-03T11:09:51+05:30 IST