మునుగోడులో వడదెబ్బతో రైతు మృతి

ABN , First Publish Date - 2021-05-11T07:17:05+05:30 IST

నల్లగొండ జిల్లా మునుగోడు మండలానికి చెందిన ఓ రైతు వడదెబ్బతో మృతి చెందాడు.

మునుగోడులో వడదెబ్బతో రైతు మృతి

 ఆలస్యంగా గుర్తించి కుటుంబసభ్యులు 

మునుగోడు రూరల్‌, మే10: నల్లగొండ జిల్లా  మునుగోడు మండలానికి చెందిన ఓ రైతు వడదెబ్బతో మృతి చెందాడు. గ్రామస్థులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామానికి చెందిన రైతు కూకుంట్ల వెంకటయ్య(61) ఆదివారం తన వ్యవసాయ భూమిలో పత్తికట్టెను తగలబెట్టి, భూమి చదును చేశాడు. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రతతో పాటు తగలబెట్టిన పత్తికట్టె వేడికి సొమ్మసిల్లి అక్కడే పడిపోగా ఎవరూ గమనించలేదు. పొలానికి వెళ్లిన రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గ్రామంలో గాలించినా ఆచూకీ లభించలేదు. బంధువుల ఇంటికి వెళ్లి ఉంటాడని కుటుంబసభ్యులు భావించారు. సోమవారం ఉదయం పొలానికి  వెళ్లి చూడగా పత్తి కట్టె కుప్పవద్ద మృతి చెంది ఉన్నాడు. వెంకటయ్యకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు


చె

Updated Date - 2021-05-11T07:17:05+05:30 IST