విద్యుదాఘాతంలో రైతు మృతి

ABN , First Publish Date - 2022-05-19T06:52:21+05:30 IST

మండలంలోని చాపిరి గ్రామానికి చెందిన రైతు సుబ్బారెడ్డి (38) బుధవారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు.

విద్యుదాఘాతంలో రైతు మృతి

 కళ్యాణదుర్గం, మే 18: మండలంలోని చాపిరి గ్రామానికి చెందిన రైతు సుబ్బారెడ్డి (38) బుధవారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. కుటుం బ సభ్యులు తెలిపిన వివరాలివి. మూడు ఎకరాల్లో పత్తిపంట సాగుచేశారు. పం టకు మందుపిచికారి చేసేందుకు భార్య సునీతతో కలిసి తోటవద్దకు వెళ్లాడు. మోటర్‌ ఆన్‌చేసే క్రమంలో స్టాటర్‌వద్దకు వెళ్లాడు. స్టాటర్‌కు షార్ట్‌సర్క్యూట్‌ కావడంతో విద్యుత్‌షాక్‌కు గురై అక్కడే కుప్పకూలాడు. అక్కడే వున్న భార్య గట్టిగా కేకలు వేయడంతో సమీపంలోని రైతులు వచ్చి కాపాడేయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు వున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-05-19T06:52:21+05:30 IST