విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN , First Publish Date - 2022-01-15T07:13:53+05:30 IST

విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన సంఘటన ఏర్పేడు మండలంలో జరిగింది.

విద్యుదాఘాతంతో రైతు మృతి
మృతిచెందిన మోహన్‌రామిరెడ్డి

ఏర్పేడు, జనవరి 14: విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన సంఘటన శుక్రవారం ఏర్పేడు మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని చెన్నంపల్లెకు చెందిన మోహన్‌రామిరెడ్డి(72) వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నాడు. కాగా, శుక్రవారం ఉదయం ఆయన వరి పంటకు నీరు పెట్టేందుకు పొలం వద్దకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో బోరు మోటరును ఆన్‌చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. కాసేపటికి స్థానిక రైతులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. దీంతో వారు పొలం వద్దకు చేరుకుని మోహన్‌రామిరెడ్డి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు.

Updated Date - 2022-01-15T07:13:53+05:30 IST