విద్యుదాఘాతంతో రైతు మృతి
ABN , First Publish Date - 2021-10-17T05:55:53+05:30 IST
మండలంలోని పీసీ ప్యాపిలి గ్రామానికి చెందిన రైతు షేక్షావలి (37) విద్యుదాఘాతంతో శనివారం మరణించాడు.
వజ్రకరూరు, అక్టోబరు 16: మండలంలోని పీసీ ప్యాపిలి గ్రామానికి చెందిన రైతు షేక్షావలి (37) విద్యుదాఘాతంతో శనివారం మరణించాడు. రైతు ఉదయం పొలంలో కందిపంటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. మోటారు స్విచ ఆన చేస్తుండగా స్టార్టర్ బాక్సుకు అప్పటికే విద్యుత సరఫరా ఉండడంతో షాక్ కొట్టింది. దీ ంతో షేక్షావలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. షేక్షావలికి భార్య వన్నూరుబీ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.