బ్లాక్ఫంగస్తో రైతు మృతి
ABN , First Publish Date - 2021-06-23T06:46:22+05:30 IST
వాల్మీకిపురం పట్టణం నాయకవీధిలో నివసిస్తున్న పాడి రైతు ఎస్. కమాల్బాషా (45) బ్లాక్ఫంగస్ వ్యాధితో మంగళవారం మృతి చెందాడు.
పీలేరు,జూన్ 22: వాల్మీకిపురం పట్టణం నాయకవీధిలో నివసిస్తున్న పాడి రైతు ఎస్. కమాల్బాషా (45) బ్లాక్ఫంగస్ వ్యాధితో మంగళవారం మృతి చెందాడు. నెల రోజుల క్రితం కరోనా సోకగా తిరుపతి రుయాస్పత్రికి తరలించారు.కరోనా నుంచి కోలుకున్న రెండు రోజులకే బ్లాక్ఫంగస్ సోకడంతో రుయాస్పత్రిలోనే చికిత్స కొనసాగించారు. పది రోజులుగా బ్లాక్ఫంగస్ వార్డులో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కమాల్బాషా మృతదేహాన్ని వాల్మీకిపురానికి తీసుకువచ్చి సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇంటి యజమాని అయిన కమాల్బాషా మృతితో కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది.