విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN , First Publish Date - 2022-05-23T04:58:27+05:30 IST

మండలంలోని రావూరు గ్రామంలో ఆదివారం ఒక రైతు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.

విద్యుదాఘాతంతో రైతు మృతి
మృతి చెందిన రైతు వెంకయ్య

ఇందుకూరుపేట, మే 22 : మండలంలోని రావూరు గ్రామంలో ఆదివారం ఒక రైతు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. రైతు బాలబొమ్మ వెంకయ్య(60) ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా త్రీఫేస్‌ విద్యుత్‌ లైన్‌లో ఓ వైరు తెగి ట్రాక్టర్‌ మీద పడింది.  దాంతో ఆయన విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాడు. బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానిక ఎస్‌ఐ సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేశారు.

Updated Date - 2022-05-23T04:58:27+05:30 IST