చికిత్స పొందుతూ రైతు మృతి
ABN , First Publish Date - 2022-08-17T05:51:52+05:30 IST
సీ బెళగల్ మండల కేంద్రానికి చెందిన మద్దికెర తిరుపతయ్య (55) మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు.
సీ బెళగల్, ఆగస్టు 16: సీ బెళగల్ మండల కేంద్రానికి చెందిన మద్దికెర తిరుపతయ్య (55) మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. తిరుపతయ్య తనకు ఉన్న 3.50 ఎకరాలతోపాటు మరో ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని పత్తి, ఉల్లి, మిరప, వేరుశనగ పంటలను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మూడేళ్లుగా తెచ్చిన అప్పులు దాదాపు రూ.8.50 లక్షలు అయ్యాయి. అయితే దిగు బడి చేతిరాక అప్పులు ఎలా తీర్చాలో అర్థంగాక మదనపడుతుండేవాడు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం పత్తి పంటకు పురుగుల మందు పిచికారి చేయడానికి భార్య లక్ష్మీదేవితో కలిసి పొలానికి వెళ్లారు. భార్యను నీళ్లకు పం పించి పురుగుల మందు తాగాడు. కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్థానిక ఎస్ఐ శివాంజల్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.