అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-04T06:00:27+05:30 IST

మండలంలోని కుచ్చుపాప గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున సిర్లు గోపాల్‌ (51) అనే రైతు అప్పుల బాధతో ఇంటిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ సుబ్బారావు తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు... గోపాల్‌కు మూడు ఎకరాల భూమి ఉండగా... గత కొన్నేళ్లేగా ఆ భూమిలో పలు రకాల పైర్లు సాగు చేసినా దిగుబడి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

చాపాడు, జూలై 3: మండలంలోని కుచ్చుపాప గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున సిర్లు గోపాల్‌ (51) అనే రైతు అప్పుల బాధతో ఇంటిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ సుబ్బారావు తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు... గోపాల్‌కు మూడు ఎకరాల భూమి ఉండగా... గత కొన్నేళ్లేగా ఆ భూమిలో పలు రకాల పైర్లు సాగు చేసినా దిగుబడి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో సుమారు రూ.20 లక్షలకు పైగా అప్పుల పాలయ్యాడు. ఇటీవల ఆ భూమిలో బోరు, పైపులైను వేయగా మరో రూ.3లక్షలు ఖర్చు అయిందన్నారు. దీంతో  చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో  చెల్లించే పరిస్థితి లేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. గోపాల్‌ మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. ఆయన మృతదేహానికి ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అతని కుమారుడు రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2022-07-04T06:00:27+05:30 IST