అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-02T05:23:45+05:30 IST

అప్పుల బాధ భరించలేక విషద్రావణం తాగి రైతు ఆత్మ హత్య చేసుకున్న సంఘటన రాయచోటి మండలంలో చోటు చేసుకుంది.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
రైతు రాంమోహన్‌రెడ్డి మృతదేహం

రాయచోటిటౌన్‌, జూలై 1: అప్పుల బాధ భరించలేక విషద్రావణం తాగి రైతు ఆత్మ హత్య చేసుకున్న సంఘటన రాయచోటి మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా.... రాయ చోటి మండలం యండపల్లె గ్రామం పెద్దరామిరెడ్డిగారి   పల్లెకు చెందిన రామ్మోహన్‌రెడ్డి (56) గత కొంత కాలంగా రాయచోటి పట్టణంలోని కొత్తపల్లె రామాపురంలో నివాసమంటూ పల్లెకు వెళ్లి పొలం పనులు చేసుకునేవారు. సొంత భూమి ఐదు ఎకరాలు, కౌలుకు 10 ఎకరాలు సాగు చేస్తున్నాడు. ఈక్రమంలో పంటలు సాగులో నష్టా లు రావడమే కాకుండా.. పిల్లల చదువు కోసం దాదాపు రూ.15 లక్షల అప్పులు చేశారు. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో గురువారం సాయంత్రం డైట్‌ హాస్టల్‌ ఆవరణలో విషద్రావణం తాగి అపస్మారకస్థితిలో పడి ఉండగా.. స్థానికులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే   చికిత్స కోసం కడపకు తరలించారు. అక్కడ వైద్యుల సలహా మేరకు తిరుపతికి తరలిస్తుండగా శుక్రవారం ఉదయం మృత్యువాత పడ్డాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ పోలు సుబ్బారెడ్డి, వైసీపీ నేత మదన్‌మోహన్‌రెడ్డిలు ఆసుపత్రి వద్దకు చేరుకుని మృతదేహాన్ని సందర్శిఽంచి.. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. 

Updated Date - 2022-07-02T05:23:45+05:30 IST