రైతు బజార్‌ పనులు త్వరితగతిన చేయండి

ABN , First Publish Date - 2021-07-25T04:59:26+05:30 IST

రైతు బజార్‌ నిర్మాణపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

రైతు బజార్‌ పనులు త్వరితగతిన చేయండి

రాయచోటి, జూలై24: రైతు బజార్‌ నిర్మాణపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాయచోటి పట్టణంలో రూ.కోటి నిధులతో నిర్మిస్తున్న రైతు బజారును శనివారం ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి పరిశీలించారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా, మాజీ ఎంపీపీ పోలు సుబ్బారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెన్నూరు అన్వర్‌బాషా, వైస్‌ చైర్మన్‌ విజయభాస్కర్‌, మేనేజర్‌ సురే్‌షలతో కలిసి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.ఆగ స్టు చివరికల్లా పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2021-07-25T04:59:26+05:30 IST