వ్యవసాయాభివృద్ధికే రైతు భరోసా కేంద్రాలుఎమ్మెల్యే చింతల

ABN , First Publish Date - 2020-08-14T08:51:23+05:30 IST

వ్యవసాయ రంగ అభివృద్ధి కోసమే ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక

వ్యవసాయాభివృద్ధికే రైతు భరోసా కేంద్రాలుఎమ్మెల్యే చింతల

వాల్మీకీపురం, ఆగస్టు 13: వ్యవసాయ రంగ అభివృద్ధి కోసమే ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మండలంలో 12 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. వ్యవసాయ పనిముట్ల కోసం రైతులు 10 శాతం సొమ్ము చెల్లిస్తే డీడీసీ బ్యాంక్‌ ద్వారా 50 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, ఏవో రాజేంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2020-08-14T08:51:23+05:30 IST