రైతు ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యం

ABN , First Publish Date - 2020-12-05T03:54:03+05:30 IST

రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యమని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.రాజేశ్వర్‌నాయక్‌ అన్నారు.

రైతు ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యం
వరి విత్తనాలు పంపిణీ చేస్తున్న రాజేశ్వర్‌నాయక్‌

-కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ రాజేశ్వర్‌నాయక్‌

కౌటాల, డిసెంబరు4: రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యమని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.రాజేశ్వర్‌నాయక్‌ అన్నారు. శుక్రవారం కౌటాల మండలం సాండ్‌గాం గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కృషి కళ్యాణ్‌ అభియాన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గిరిజన ఉప ప్రణా ళిక కింద 25 మంది గిరిజన రైతులకు కేఎన్‌ఎం118 వరి విత్తనాలు, జీవన ఎరువు లను ఉచితంగా అందిం చడం జరుగు తుందన్నారు. అలాగే వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలు కోళ్ల పెంపకం, చేపల, గొర్రెల పెపంకం వల్ల కలిగే లాభాల గురించి వివరిం చారు. వ్యవసయంలో పంట ల మార్పిడి, అంతర పంట సాగు తదితరాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విశ్వనాథ్‌, జిల్లా వ్యవసాయాధికారి రవీందర్‌, మండల వ్యవసా యాధికారి రాజేష్‌, ఏఈఓ శ్రీకన్య, అంజన్న, నీటి సరఫరా సంఘం అధ్యక్షుడు వెంకటే శ్వర్‌రావు, సర్పంచ్‌ దామోదర్‌, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T03:54:03+05:30 IST