భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్లకోసం ఫ్యాన్స్ ఆత్రుత
ABN , First Publish Date - 2022-08-13T09:39:32+05:30 IST
ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా ఈ 28న భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దాంతో ఈ మ్యాచ్ టిక్కెట్లకోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
స్పందించని ఏసీసీ
దుబాయ్ : ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా ఈ 28న భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దాంతో ఈ మ్యాచ్ టిక్కెట్లకోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) భారత్-పాక్ మ్యాచ్ పోరు టిక్కెట్ల అమ్మకానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి ప్రకటిస్తున్నారు. ఈ మ్యాచ్కి సంబంధించిన టిక్కెట్లు ఎప్పటినుంచి విక్రయిస్తారో ఇప్పటిదాకా వెల్లడించకపోవడం అసహనం కలిగిస్తోందని దుబాయ్లో నివసిస్తున్న ఓ భారత సంతతి ఫ్యాన్ వాపోయాడు. మరోవైపు అక్టోబరు 23న ఎంసీజీలో జరిగే భారత్-పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ పోరుకు టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడవడం విశేషం.