యడియూరప్ప రాజీనామా.. వీరాభిమాని ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-07-28T00:51:58+05:30 IST
కర్ణాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడియూరప్పను విపరీతంగా అభిమానించే వ్యక్తి ఒకరు అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు.
బెంగళూరు: కర్ణాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడియూరప్పను విపరీతంగా అభిమానించే వ్యక్తి ఒకరు అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయడంతో తీవ్రంగా కలత చెందిన రవి.. ఉరిపోసుకుని ప్రాణాలు విడిచారు. ఛామరాజ్నగర్ జిల్లా బొమ్మలాపూర్ గ్రామానికి చెందిన రవి రోజుకూలీకి వెళ్లి పొట్టపోసుకునేవాడని స్థానికులు తెలిపారు. కాగా.. రవి మరణంపై యడియూరప్ప తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘రాజకీయాల్లో ఎగుడుదిగుడులు సహజం. ప్రాణత్యాగాలకు దిగడమనేది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని వ్యాఖ్యానించారు. కాగా.. కర్ణాటక ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఆయన అభిమానులు అనేక మంది ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.