India vs Pak మ్యాచ్ టికెట్స్ కావాలని..
ABN , First Publish Date - 2021-10-09T22:26:53+05:30 IST
యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చివరి దశకు చేరుకుంది. ఇది పూర్తయిన వెంటనే ఐసీసీ
న్యూఢిల్లీ: యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చివరి దశకు చేరుకుంది. ఇది పూర్తయిన వెంటనే ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభమవుతుంది. ఈ మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఇప్పుడు ఈ మ్యాచ్ కోసమే ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించాలని వేలామంది అభిమానులు ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో తనకు రెండు టికెట్లు ఇప్పించాలంటూ ఓ అభిమాని రోహిత్శర్మను వేడుకోవడం వైరల్ అయింది.
ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్-సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య నిన్న (శుక్రవారం) యూఏఈలోని సేక్ జాయెద్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్కు హాజరైన ఓ ప్రేక్షకుడు స్టాండ్స్ నుంచి రోహిత్ ఫొటోతో ఓ ప్లకార్డు ప్రదర్శించాడు.
టీ20 ప్రపంచకప్లో భారత్-పాక్ తలపడే మ్యాచ్ కోసం తనకు రెండు టికెట్లు కావాలని, ఎలాగైనా ఇప్పించాలంటూ ప్లకార్డు ప్రదర్శించాడు. అతడు అలా ప్లకార్డు ప్రదర్శించాడో, లేదో వెంటనే అది కెమెరా సిబ్బంది కంటపడడంతో ఒక్కసారి అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాకూ ఎక్కింది. ఈ నెల 17న ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభం కాబోతోంది. 24న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి.