ప్రముఖ కవి మద్దా సత్యనారాయణ ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-03-19T13:31:59+05:30 IST
జిల్లాకు చెందిన ప్రముఖ కవి, సామాజిక కార్యకర్త మద్దా సత్యనారాయణ పురుగుల
తూర్పు గోదావరి: జిల్లాకు చెందిన ప్రముఖ కవి, సామాజిక కార్యకర్త మద్దా సత్యనారాయణ పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. సత్యనారాయణ స్వస్థలం కరప మండలం గురజనాపల్లి. ఈయన పలు రచనలు చేశారు. పెద్దల మాట చద్దిమూట, మద్దా వారి మణిపూసలు, తరువోజ, బధిరుడు, పదవులున్నోళ్లకు పసుపు కుంకుమలు, ఆశాజ్యోతి అంబేడ్కర్, నల్లధనంపై వేటు తదితర రచనలను సత్యనారాయణ చేశారు.
సత్యనారాయణ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు. ఒకవైపు రచనలు చేస్తూనే మరోవైపు అక్షర సత్య సేవా సంస్థను నెలకొల్పారు. దీని ద్వారా సమాజ సేవా కార్యక్రమాలు చేశారు. కుటుంబంలో జరిగిన గొడవల కారణంగా ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే కుటుంబసభ్యులు కాకినాడలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలిచారు. అక్కడి చికిత్స పొందుతూ సత్యనారాయణ మృతి చెందారు.