కరోనా వైరస్ సోకి.. ప్రముఖ వైద్యుడు డాక్టర్ లవకుశలు మృతి
ABN , First Publish Date - 2020-08-02T12:12:22+05:30 IST
కరోనా వైరస్ సోకి తెనాలికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ బి.లవకుశులు..
తెనాలి(గుంటూరు): కరోనా వైరస్ సోకి తెనాలికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ బి.లవకుశులు(70) శనివారం మృతి చెందారు. విజయవాడలోని ఓ ఆసుపత్రిలో గత పది రోజులుగా చికిత్స పొందుతూ రెండుసార్లు ప్లాస్మా సేకరించి చికిత్స చేసిన ఫలితం కనబడలేదని చెబుతున్నారు. ఆయన మృతి పట్ల పలువురు వైద్యులు, పట్టణ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు అమెరికాలో ఉన్నారు. అక్కడ నుంచి వందేభారత్ మిషన్లో ఇండియా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.