కుటుంబ కలహమే.. విడాకులు కాదు
ABN , First Publish Date - 2022-01-20T08:59:43+05:30 IST
కుటుంబ కలహమే.. విడాకులు కాదు
ధనుష్ - ఐశ్వర్య బ్రేకప్పై దర్శకుడు కస్తూరి రాజా
చెన్నై, జనవరి 19 : ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ జంట విడాకులు తీసుకోవడం లేదని ధనుష్ తండ్రి, తమిళ సినిమా దర్శకుడు కస్తూరి రాజా తెలిపారు. ఆ జంట మధ్య ఉన్నది కేవలం కుటుంబ కలహాలేనని స్పష్టం చేశారు. ‘‘మనస్పర్ధల వల్లే ధనుష్, ఐశ్వర్య విడిపోయారు. ఇదో కుటుంబ కలహం మాత్రమే. భార్యాభర్తలందరి మధ్య జరిగే గొడవలాంటిదే ఇది కూడా. వాళ్లిద్దరూ ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. ఇద్దరితో ఫోన్లో మాట్లాడా. కొన్ని సలహాలు ఇచ్చా’’ అని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కస్తూరి రాజా పేర్కొన్నారు. కాగా, 18 ఏళ్ల వివాహ బంధానికి తెరదించుతూ తాము విడిపోతున్నామంటూ ధనుష్, ఐశ్వర్య సోషల్ మీడియా ద్వారా సోమవారం రాత్రి వేర్వేరుగా ప్రకటించారు.