కుమార్తెను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని.. మర్మాంగాలు కోసేశారు!

ABN , First Publish Date - 2021-12-25T02:48:10+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలోని సాగర్‌పూర్‌లో దారుణం జరిగింది. తమ కుమార్తెను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో

కుమార్తెను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని.. మర్మాంగాలు కోసేశారు!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని సాగర్‌పూర్‌లో దారుణం జరిగింది. తమ కుమార్తెను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో యువతి కుటుంబ సభ్యులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. యువకుడిని (22) పట్టుకుని చితకబాదారు. ఆపై అతడి మర్మాంగాలను కోసేశారు. ఈ ఘటనకు సంబంధించి యువతి కుటుంబ సభ్యులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విషయంలో సరిగా దర్యాప్తు జరపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 


యువతీ యువకులు ఇద్దరూ మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఇద్దరూ కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయి కోర్టులో పెళ్లి చేసుకున్నారు. బుధవారం ఇద్దరూ కలిసి రాజౌరీ గార్డెన్ పోలీస్ స్టేషన్‌కు స్టేట్‌మెంట్ల రికార్డు కోసం వెళ్లారు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్ బయటే కాపుకాసిన యువతి కుటుంబ సభ్యులు వారిని పట్టుకుని సాగర్‌పూర్‌లోని వారింటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత యువతి తండ్రి, సోదరుడు, మామ కలిసి యువకుడిపై దాడిచేశారు. ఆ తర్వాత అతడి మర్మాంగాలను కోసేశారు. బాధితుడు ప్రస్తుతం ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులపై కిడ్నాప్, హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-25T02:48:10+05:30 IST