మూడేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. 10 నెలల కొడుకు.. ఈ ముగ్గురూ ఇప్పుడు ప్రాణాలతో లేరు.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-04-25T22:26:40+05:30 IST

అతను మూడేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. 10 నెలల కొడుకు కూడా ఉన్నాడు..

మూడేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. 10 నెలల కొడుకు.. ఈ ముగ్గురూ ఇప్పుడు ప్రాణాలతో లేరు.. అసలేం జరిగిందంటే..

అతను మూడేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. 10 నెలల కొడుకు కూడా ఉన్నాడు.. ఉద్యోగ రీత్యా తరచుగా టూర్లకు వెళ్లేవాడు.. భార్య, కొడుకును ఇంట్లో వదిలి వెళ్లలేక తనతో పాటు తీసుకెళ్లేవాడు.. రెండ్రోజుల క్రితం కూడా అలాగే కుటుంబంతో కలిసి టూర్‌కు వెళ్లాడు.. తిరిగి వచ్చే సమయంలో ఓ భారీ యాక్సిడెంట్ జరిగింది.. ఆ ప్రమదంలో ముగ్గురూ మరణించారు.. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం అలముకుంది. 


రాజస్థాన్‌లోని జైపూర్‌ విద్యాధర్ నగర్‌కు చెందిన గజేంద్ర అనే వ్యక్తి మూడేళ్ల క్రితం శుచిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పది నెలల క్రితం వీరికి ఓ కుమారుడు జన్మించాడు. ఉద్యోగ రీత్యా గజేంద్ర తరచుగా టూర్లకు వెళుతుండేవాడు. ఇంట్లో భార్యను, కొడుకును వదల్లేక వారిని కూడా తనతో పాటు కార్లో టూరుకు తీసుకెళ్లేవాడు. రెండ్రోజుల క్రితం కూడా తన భార్య, కొడుకును తీసుకుని బికనీర్ వెళ్లాడు. అక్కడ ఓ హోటళ్లో కుటుంబంతో కలిసి ఉన్నాడు. 


పని పూర్తయిన తర్వాత జైపూర్‌కు తిరిగి కార్లో బయల్దేరాడు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో అతని కారును ఓ ట్రక్కు ఢీకొంది. కిటాసర్‌ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న విద్యాధర్ నగర్‌ వాసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను బంధువులకు అప్పగించారు. 

Updated Date - 2022-04-25T22:26:40+05:30 IST