మాజీ డీఎస్పీ మోసం చేశారంటూ...

ABN , First Publish Date - 2022-04-26T17:22:33+05:30 IST

మాజీ డీఎస్‌పీ మోసం చేశారంటూ ఒకే కుటుంబానికి చెందని ఏడుగురు వ్యక్తులు ఓవర్‌హెడ్‌ ట్యాంకుపైకి చేరి దూకేస్తామంటూ హల్‌ఛల్‌ చేసిన సంఘటన దొడ్డబళ్ళాపుర పరిధిలో

మాజీ డీఎస్పీ మోసం చేశారంటూ...

- ఏడుగురు ఆత్మహత్యాయత్నం

- ఒకే కుటుంబానికి చెందినవారే...


బెంగళూరు: మాజీ డీఎస్‌పీ మోసం చేశారంటూ ఒకే కుటుంబానికి చెందని ఏడుగురు వ్యక్తులు ఓవర్‌హెడ్‌ ట్యాంకుపైకి చేరి దూకేస్తామంటూ హల్‌ఛల్‌ చేసిన సంఘటన దొడ్డబళ్ళాపుర పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం బెంగళూరు గ్రామీణ జిల్లా దొడ్డబళ్ళాపుర పరిధిలోని జేకేవీ లే అవుట్‌లోని ఓవర్‌హెడ్‌ ట్యాంకుపైకి ఏడుగురు వ్యక్తులు చేరారు. కాసేపటికే విషయం తెలియడంతో పోలీసులు, అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయి. ఇదే సందర్భంగా కుటుంబ పెద్ద ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ చింతామణి తాలూకా కొండవనళ్ళి గ్రామానికి చెందినవారమని ఇటీవల కొన్నేళ్ళుగా దొడ్డబళ్ళాపురలోనే నివసిస్తున్నట్లు తెలిపారు. బంధువైన మాజీ డీఎస్‌పీ కోనప్పరెడ్డి భూమి విషయంలో మోసం చేశారని ఆరోపించారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. చింతామణి పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకోవడం లేదన్నారు. మాజీ డీఎస్‌పీ కోనప్పరెడ్డి ఇక్కడకు వచ్చి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇస్తేనే కిందకు దిగుతామన్నారు. లేని పక్షంలో మూకుమ్మడిగా కిందకు దూకేస్తామన్నారు. పోలీసులు సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించారు. కాసేపటికే మరింత మంది పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేస్తామని కోనప్పరెడ్డిని విచారిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.

Updated Date - 2022-04-26T17:22:33+05:30 IST