పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు
ABN , First Publish Date - 2022-01-17T06:54:38+05:30 IST
గుంటూరు జిల్లా మాచర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు.
రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకుల దుర్మరణం
రంగుండ్ల తండాలో విషాదఛాయలు
తిరుమలగిరి(సాగర్), జనవరి 16: గుంటూరు జిల్లా మాచర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు. దీంతో మండలంలోని రంగుండ్లతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే తిరుమలగిరి(సాగర్) మండలంలోని రంగుండ్లతండాకు చెందిన ఆంగోతు బాబురావు (36) స్థానిక పోలీ్సస్టేషనలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. గుంటూరు జిల్లా దుర్గి మండలంలోని నెహ్రూనగర్ తండాలో నివాసముంటున్న తన చెల్లెలు, బావ సంక్రాంతి పండగకు రమ్మని ఆహ్వానించారు. బాబురావు తన తండ్రి మోతీరాం(60)ను వెంటపెట్టుకొని ద్విచక్ర వాహనంపై శనివారం మధ్యాహ్నం చెల్లెలి ఇంటికి వెళ్లారు. సాయంత్రం వరకు బంధుమిత్రులతో గడిపిన అనంతరం రాత్రి 9 గంటల తర్వాత రంగుండ్లతండాకు బయలుదేరారు. ఈ క్రమంలో మాచర్ల సమీపంలో బైక్ను కారు ఢీకొట్టడంతో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఈ సంఘటన గురించి తెలుసుకున్న వారి బంధువులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పండుగ రోజే ఆ కుటుంబానికి పెద్దలు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు మిన్నంటాయి. ఆదివారం సాయంత్రం తండ్రీకొడుకులిద్దరి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, సీఎల్పీ మాజీనేత కుందూరు జానారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్ తదితర నాయకులు వారి మృతదేహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాబురావు హోంగార్డుగా విధులు నిర్వహిస్తుండటంతో ఎస్పీ రెమారాజేశ్వరి ఆదేశాల మేరకు రిజర్వ్ ఇనస్పెక్టర్ స్పర్జనరాజ్, మిర్యాలగూడ రూరల్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు పరమేష్, సుధాకర్, ఎల్లయ్యలు పోలీ్సశాఖ తరుపున సంతాపం తెలియజేశారు. అదేవిధంగా హోంగార్డుల సంక్షేమ నిధి నుంచి అంత్యక్రియల నిమిత్తం రూ.20వేల ఆర్థిక సహాయం అందజేశారు. బాబూరావు కుటుంబానికి ఎస్పీ రెమా రాజేశ్వరి, డీటీసీ ఎస్పీ సతీష్ చోడగిరి, ఏఆర్ డీఎస్పీ సురే్షకుమార్, మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్రావు, హోంగార్డుల ఆర్ఐ కృష్ణారావు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్ సంతాపం తెలిపారు.