కరోనా వచ్చిందని అసత్య ప్రచారం
ABN , First Publish Date - 2020-06-01T10:57:50+05:30 IST
తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని
పోలీసులకు సింధురాజపురం వాసి ఫిర్యాదు
శ్రీరంగరాజపురం, మే 31: తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీరంగరాజపురం మండలంలోని సింధురాజపురం గ్రామానికి చెందిన ఓ డాక్టర్ ఆదివారం ఎస్ఐ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. పళ్లిపట్టులోని తన క్లినిక్కు ఆస్తమాతో వచ్చిన వ్యక్తికి చికిత్స చేశానన్నారు. అతడికి కరోనా ఉండటంతో తనికీ వచ్చిందని ప్రచారం చేశారన్నారు. తాను పరీక్షలు చేసుకోగా నెగటివ్ ఫలితాలు వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.