అసత్య వార్తలను వ్యాప్తి చేయొద్దు: కేటీఆర్
ABN , First Publish Date - 2020-08-13T08:02:48+05:30 IST
సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తలను వ్యాప్తి చేయొద్దని నెటిజన్లకు తెలంగాణ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తలను వ్యాప్తి చేయొద్దని నెటిజన్లకు తెలంగాణ మంత్రి కేటీఆర్ సూచించారు. బెంగళూరులోని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి నివాసం, కేజే హళ్లీ పోలీస్ స్టేషన్ వద్ద అల్లరి మూకల దాడుల ఘటనలపై బుధవారం ట్విటర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తల వ్యాప్తితో ఎంతటి ప్రమాదం జరుగుతుందో తెలుసుకోవడానికి బెంగళూరు ఘటన ఉదాహరణ అని చెప్పారు. ఆ ఘటనకు సంబంధించిన ఫొటోలను కేటీఆర్ ట్వీట్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించే సాధనాలుగా సామాజిక మాధ్యమాలు మారకూడదన్నారు.