టీడీపీ నేతలపై తప్పుడు కేసులు దుర్మార్గం: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-10-23T23:33:06+05:30 IST

టీడీపీ నేతలపై తప్పుడు కేసులు దుర్మార్గమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

టీడీపీ నేతలపై తప్పుడు కేసులు దుర్మార్గం: చంద్రబాబు

అమరావతి: టీడీపీ నేతలపై తప్పుడు కేసులు దుర్మార్గమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి కేసుకూ.. ప్రతి దాడికీ.. బదులు చెప్తామని హెచ్చరించారు. టీడీపీ నేత గురజాల సందీప్ మహదేవ్ అరెస్ట్‌ దుర్మార్గమన్నారు. సోషల్ మీడియాలో పోస్టు పెడితే అరెస్ట్‌ చేస్తారా? అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టులపై అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టిందని గుర్తుచేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం భావప్రకటన స్వేచ్ఛ ఉందని, రాజ్యాంగ హక్కుల్ని కూడా హరించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి కేసుకూ, ప్రతి దాడికీ.. వడ్డీతో సహా చెల్లిస్తామని చంద్రబాబు హెచ్చరించారు.

Updated Date - 2021-10-23T23:33:06+05:30 IST