సరస్వతి పుత్రిక ‘విమల’కు నగదు పురస్కారం
ABN , First Publish Date - 2022-06-27T04:36:48+05:30 IST
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ (బైపీసీ)లో 959 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ చూపిన సరస్వతి పుత్రిక విమలకు ఆదివారం పొదలకూరు టీటీసీ బ్యాచ్ మిత్రుల తరఫున రూ.15,516లు నగదు ప్రోత్సాహం అందించామని తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షుడు అచ్యుతమణి తెలిపారు.
పొదలకూరు, జూన్ 26 : పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ (బైపీసీ)లో 959 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ చూపిన సరస్వతి పుత్రిక విమలకు ఆదివారం పొదలకూరు టీటీసీ బ్యాచ్ మిత్రుల తరఫున రూ.15,516లు నగదు ప్రోత్సాహం అందించామని తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షుడు అచ్యుతమణి తెలిపారు. 1984-85లో టీటీసీ చదివిన తన తోటి ఉపాధ్యాయ మిత్రులు 15 మంది కలిసి నగదు అందించారన్నారు. విమలను వారి నివాసంలో శాలువాతో సత్కరించి, స్వీట్స్ తినిపించారు. ఈ చిన్న ప్రోత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత చదువులు చదివి, సమాజసేవ చేయాలని కోరారు. ఇలాంటి ‘మట్టిలో మాణిక్యానికి మరింత మంది చేయూతనిచ్చి చదివించాలని కోరారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులను అభినందించారు. రాధికా, మదిర శ్రీనివాసులు పాల్గొన్నారు.