నకిలీ విత్తన బాధితులకు న్యాయం చేయండి

ABN , First Publish Date - 2022-01-28T06:01:48+05:30 IST

అక్కన్నపేట మండలం కుందనవానిపల్లి గ్రామంలో కాంచన్‌ సీడ్స్‌ కంపెనీ పేరిట ఇచ్చిన మొక్కజొన్న విత్తనాలు సాగు చేసి నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని హుస్నాబాద్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డికి బీజేపీ నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు. ఎకరాకు రూ. 20వేల చొప్పున పెట్టుబడి పెట్టి పంట సాగుచేస్తే మొక్క ఎదగ లేదని, కంకి రాలేదని తెలిపారు.

నకిలీ విత్తన బాధితులకు న్యాయం చేయండి

అక్కన్నపేట, జనవరి 27: అక్కన్నపేట మండలం కుందనవానిపల్లి గ్రామంలో కాంచన్‌ సీడ్స్‌ కంపెనీ పేరిట ఇచ్చిన మొక్కజొన్న విత్తనాలు సాగు చేసి నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని హుస్నాబాద్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డికి బీజేపీ నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు. ఎకరాకు రూ. 20వేల చొప్పున పెట్టుబడి పెట్టి పంట సాగుచేస్తే మొక్క ఎదగ లేదని, కంకి రాలేదని తెలిపారు. రైతులకు న్యాయం చేయాలని, పరిహారం అందేలా చూడాలని డిమాండ్‌ చేశారు. ఫిర్యాదు చేసినవారిలో బీజేపీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి, నాయకులు బత్తుల శంకర్‌బాబు, దొడ్డి శ్రీనివాస్‌, వంగపల్లి సాగర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-01-28T06:01:48+05:30 IST