సోషల్ మీడియాలో హోరెత్తుతున్న ఫేక్ న్యూస్

ABN , First Publish Date - 2020-04-10T20:09:46+05:30 IST

కరోనా వైరస్‌పై తప్పుడు ప్రచారం చేయొద్దని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు

సోషల్ మీడియాలో హోరెత్తుతున్న ఫేక్ న్యూస్

కరోనా వైరస్‌పై తప్పుడు ప్రచారం చేయొద్దని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా హెచ్చరిస్తున్న నకిలీ సమాచారం మాత్రం ఆగడంలేదు. కరోనాపై వదంతుల కట్టడికి ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఫేక్ మెసేజ్‌లకు మాత్రం బ్రేకులు పడడంలేదు. గంటకో గాసిప్ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. ప్రధాని మోదీ సయితం తాజాగా తనపై జరుగుతున్న ఓ ప్రచారాన్ని స్వయంగా ఖండించాల్సిన పరిస్థితి వచ్చింది. 


కరోనా కట్టడి కోసం ఎంతో శ్రమిస్తున్న మోదీకి ప్రజలంతా కృతజ్ఞతలు చెప్పాలంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఐదు నిముషాలపాటు ప్రజలంతా ఇంటి బాల్కనీలో నిలబడి మోదీకి సెల్యూల్ చేయాలని కొందరు ప్రచారం చేస్తున్నారు. అది నిజమనుకుని కొంతమంది నెటిజన్లు పాజిటీవ్‌గా స్పందిస్తున్నారు. అలాగే చేస్తామంటూ కామెంట్లు పెడుతున్నారు. చివరికిది మోదీ వరకు వెళ్లింది. తనను వివాదాల్లోకి లాగేందుకు కొందరు అల్లరి మూకలు చేసే పనిగా ఆయన చెప్పుకొచ్చారు.


Updated Date - 2020-04-10T20:09:46+05:30 IST