నకిలీ ఫుడ్ఇన్స్పెక్టర్ల హల్చల్
ABN , First Publish Date - 2020-07-01T11:53:40+05:30 IST
సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో ఫుడ్ఇన్స్పెక్టర్లమని ఇద్దరు గుర్తతెలియని వ్యక్తులు హల్చల్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జోగిపేట, జూన్ 30: సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో ఫుడ్ఇన్స్పెక్టర్లమని ఇద్దరు గుర్తతెలియని వ్యక్తులు హల్చల్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్షసాక్షులు, సంగారెడ్డి డివిజన్ ఫుడ్ఇన్స్పెక్టర్ రవీందర్రావు కథనం ప్రకారం సోమవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు పట్టణంలోని పలు బేకరీలకు వెళ్లి ఫుడ్ఇన్స్పెక్టర్లుగా పరిచయం చేసుకున్నారు. దకాణాల లైసెన్సులు రెన్యూవల్ చేసుకోవాలని, రూ. 6 వేలు చెల్లిస్తే లైసెన్సులు వాట్సా్పలో పంపుతామని పేర్కొన్నారు. అనుమానం వచ్చిన యజమానులు డబ్బులు రేపు ఇస్తామని చెప్పారు. అనంతరం కిరాణా అండ్ జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ నాయకుడికి సమాచారమిచ్చారు.
సంగారెడ్డిలోని ఫుడ్ఇన్స్పెక్టర్ రవీందర్రావును సంప్రదించగా.. తామెవరినీ పంపలేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన సూచన మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నకిలీ ఫుడ్ఇన్స్పెక్టర్ల ఫొటోలను పోలీసులకు అందజేశారు. ఫుడ్ఇన్స్పెక్టర్లమని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే 9885687765 నంబర్లో తనకు సమాచారందించాలని ఫుడ్ఇన్స్పెక్టర్ రవీందర్రావు కోరారు.