ఎరువు బస్తాలో ఇసుక.. రైతు షాక్

ABN , First Publish Date - 2021-08-10T22:25:31+05:30 IST

వికారాబాద్ : పొలానికి ఎరువు తెచ్చిన రైతు.. అందులో ఇసుక చూసి షాక్‌ అయ్యాడు. వికారాబాద్ జిల్లా దోమ మండలం పోతిరెడ్డి పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఎరువు బస్తాలో ఇసుక.. రైతు షాక్

వికారాబాద్ : పొలానికి ఎరువు తెచ్చిన రైతు.. అందులో ఇసుక చూసి షాక్‌ అయ్యాడు. వికారాబాద్ జిల్లా దోమ మండలం పోతిరెడ్డి పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..  పోతిరెడ్డి పల్లికి చెందిన రైతు బాబియా నాయక్ పొలం సాగుకు..  బుర్లాపూర్‌లోని ఓ ఫెర్టిలైజర్ షాపు నంచి కిసాన్ కంపెనీకి చెందిన 9బస్తాల డీఏపీ ఎరువు తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చాక విప్పి చూస్తే అందులో ఇసుక దర్శనమిచ్చింది. ఒక్కో బస్తాలో సుమారు 4, 5 కిలోల ఇసుక ఉందని రైతు వాపోయాడు. గతంలోనూ ఇదే షాపులో నకిలీ విత్తనాలు అంటగట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.

Updated Date - 2021-08-10T22:25:31+05:30 IST