Fraud...నకిలీ పత్రాలతో కోటి 30 లక్షల మోసం

ABN , First Publish Date - 2022-08-07T20:10:47+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లతో ఓ ప్రైవేట్ బ్యాంక్‌ను మోసం చేశారు.

Fraud...నకిలీ పత్రాలతో కోటి 30 లక్షల మోసం

హైదరాబాద్ (Hyderabad): నగరానికి చెందిన కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలతో (Fake documents) రూ. కోటి 30 లక్షలు మోసం (Fraud) చేశారు. లోన్ (Loan) పేరుతో నకిలీ పత్రాలు తయారు చేసి ఓ ప్రైవేట్ బ్యాంకు (Private Bank) నుంచి రూ. కోటి 30 లక్షలు లోన్ తీసుకున్నారు. తర్వాత బ్యాంక్ అధికారులు డాక్యుమెంట్స్‌ను వెరిఫికేషన్ (Verification) చేయడంతో అవి నకిలీ పత్రాలుగా నిర్ధారించారు. వారు డూప్లికేట్ డాక్యుమెంట్ సమర్పించి.. బ్యాంక్‌ను మోసం చేశారంటూ అధికారులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-08-07T20:10:47+05:30 IST