విప్రోలో ఉద్యోగాల పేరుతో 2 కోట్లకు టోకరా
ABN , First Publish Date - 2020-09-19T09:04:29+05:30 IST
నకిలీ కన్సెల్టెన్సీ ద్వారా ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు రూ. 2కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన ఘరానా మోసగాడిని
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): నకిలీ కన్సెల్టెన్సీ ద్వారా ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు రూ. 2కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన ఘరానా మోసగాడిని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్వోటీ) పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా తిరువూరు మండలం శాంతినగర్కు చెందిన మోదుగుమూడి గుణ చంద్రశేఖర్ అలియాస్ గుణ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 13ఏళ్లు పనిచేశాడు. కేపీహెచ్బీ కాలనీలో విన్సెర్ సాఫ్ట్టెక్ ప్రై లిమిటెడ్ ఓ నకిలీ కన్సెల్టెన్సీని ఏర్పాటు చేశాడు. విప్రో, ఇతర బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాలంటూ.. 75 మంది నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.1.50-2.50 లక్షల వరకు.. మొత్తం రూ. 2 కోట్లు వసూలు చేశాడు. వారందరికీ విప్రో పేరుతో నకిలీ అపాయింట్మెంట్ ఆర్లర్లు పంపాడు. తీరా ఉద్యోగంలో చేరుదామని వెళ్లిన వారికి తాము మోసపోయామని తెలిసింది. దాంతో.. మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.