ఎయిర్ లైన్స్‌లో ఉద్యోగం పేరుతో 200 మందిని దోచుకున్న మోసగాళ్లు.. ఇదంతా ఎలా చేశారంటే..

ABN , First Publish Date - 2022-02-06T05:30:00+05:30 IST

జీవినం సాగించడానికి ఉద్యోగం వెతికేవాళ్లను టార్గెట్ చేసి ఒక హైటెక్ ముఠా లక్షలు దోచుకుంది. ఇకరిద్దరు కాదు.. ఏకంగా 200 మందికి పైగా ఈ కేటుగాళ్ల చేతిలో మోసపోయారు. ఈ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి పోలీసులు...

ఎయిర్ లైన్స్‌లో ఉద్యోగం పేరుతో 200 మందిని దోచుకున్న మోసగాళ్లు.. ఇదంతా ఎలా చేశారంటే..

జీవినం సాగించడానికి ఉద్యోగం వెతికేవాళ్లను టార్గెట్ చేసి ఒక హైటెక్ ముఠా లక్షలు దోచుకుంది. ఇకరిద్దరు కాదు.. ఏకంగా 200 మందికి పైగా ఈ కేటుగాళ్ల చేతిలో మోసపోయారు. ఈ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించారు. మొత్తం ముగ్గురు మాస్టర్ మైండ్స్‌ పురుషులతో సహా 9 మంది ఆడవాళ్లను పోలీసులు అరెస్టు చేశారు.


వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలోని శాస్త్రి నగర్ ప్రాంతంలో ముగ్గురు యువకులు నీరజ్, ఆమిర్, సోను కలిసి ఒక కాల్ సెంటర్ నడుపుతున్నారు. ఇందులో మొత్తం 9 మంది యువతులు పనిచేస్తున్నారు. వీరంతా ఉద్యోగం కోసం వెతికే వారి గురించి సమాచారం సేకరించి వారికి ఫోన్లు చేస్తారు. ఎయిర్ లైన్స్‌లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఆశ చూపి.. ఆఫీసుకి రమ్మంటారు. ఆ తరువాత ఆఫీసులో ప్రొఫైల్ తయారు చేయాలి. రిజిస్ట్రేషన్ చేయాలి. శిక్షణ తీసుకోండి అని ఒక్కో వ్యక్తి వద్ద రూ.50,000 నుంచి రూ.3 లక్షల దాకా లాగుతారు.


కానీ డబ్బులు తీసుకున్నాక క్రమంగా అదిగో.. ఇదిగో కాలం వెళ్లదీసి.. ఆ తరువాత ఫోన్లు కట్ చేస్తారు. చివరికి బాధితులకు ఉద్యోగ పరీక్షలో ఫెయిలయ్యారని చెబుతారు. బాధితులు తాము మోసపోయామని గ్రహించినా.. ఏమి చేయలేని పరిస్థితి సృష్టిస్తారు. ఇలా కాలం వెళ్ల దీస్తున్న ఈ కేటుగాళ్ల గురించి ఒక బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


పోలీసులు ఒక వ్యక్తిని నిరుద్యోగి రూపంలో ఆ నకిలీ కాల్ సెంటర్ వద్ద పంపి వారి గురించి మొత్తం కూపీ లాగారు. ఆ తరువాత కాల్ సెంటర్‌‌లో తనిఖీ చేసి మొబైల్స్, లాప్‌టాప్స్, రూ.2.5 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కాల్ సెంటర్ నడుపుతున్న 9 మంది యువతులతో సహా.. 3 పురుషులను అరెస్టు చేశారు. ఇప్పటివరకు ఈ మోసగాళ్లు 200 మందిపైగా నిరుద్యోగులను ఎయిర్ లైన్స్ పేరుతో దోచుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.


Updated Date - 2022-02-06T05:30:00+05:30 IST