కరోనాను అరికట్టడంలో విఫలం

ABN , First Publish Date - 2020-08-08T05:35:23+05:30 IST

కొవిడ్‌-19ను అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా సీపీఎం, టీడీపీ, సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం పరిగిలోని అంబేద్కర్‌ విగ్రహం దగ్గర నోటికి నల్లబ్యాడ్జీలు

కరోనాను అరికట్టడంలో విఫలం

సీపీఎం, సీపీఐ, టీడీపీ ఆధ్వర్యంలో నిరసనలు


పరిగి: కొవిడ్‌-19ను అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా సీపీఎం, టీడీపీ, సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం పరిగిలోని అంబేద్కర్‌ విగ్రహం దగ్గర నోటికి నల్లబ్యాడ్జీలు ధరించి ఆయా పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.వెంకటయ్య, సీపీఐ కార్యదర్శి మోహనాచారి, టీడీపీ కార్యదర్శి లాజరస్‌ మాట్లాడుతూ,  రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా కరోనా పరీక్షలు చేయాలని, లక్షణాలు ఉన్న వారందరినీ గుర్తించి క్వారంటైన్‌లో ఉంచి, ఉచిత సదుపాయాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు హబీబ్‌, శ్రీకాంత్‌, వెంకటయ్య,శ్రీను, మాణిక్యం, చందు, హరి తదితరులు పాల్గొన్నారు.


సీపీఎం ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన

తాండూరు : సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తాండూరు పట్టణంలోని చాకలిఐలమ్మ విగ్రహం వద్ద  సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నాయకులు  నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ కరోనాను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో బుగ్గప్ప,  ఉప్పలి మల్కయ్య, వెంకటేష్‌, గోవింద్‌, ఆంజనేయులు, ముకుంద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-08T05:35:23+05:30 IST