విసన్నపేట, జమాదులపాలెం భూఆక్రమణలపై నిజ నిర్ధారణ కమిటీ
ABN , First Publish Date - 2021-10-20T05:26:33+05:30 IST
కశింకోట మండలం విసన్నపేట, జమాదులపాలెం గ్రామాల్లో భూ ఆక్రమణలపై అఖిలపక్ష నాయకులు, న్యాయవాదులు, మీడియా ప్రతినిధులతో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్టు సీపీఐ నాయకులు ఎ.బాలకృష్ణ, వైఎన్ భద్రం తెలిపారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్ కనిశెట్టి సురేశ్బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వీరు మాట్లాడుతూ, ప్రభుత్వ, బంజరు భూముల ఆక్రమణలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
క్షేత్రస్థాయిలో పర్యటించాలని నిర్ణయం
తుమ్మపాల, అక్టోబరు 19: కశింకోట మండలం విసన్నపేట, జమాదులపాలెం గ్రామాల్లో భూ ఆక్రమణలపై అఖిలపక్ష నాయకులు, న్యాయవాదులు, మీడియా ప్రతినిధులతో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్టు సీపీఐ నాయకులు ఎ.బాలకృష్ణ, వైఎన్ భద్రం తెలిపారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్ కనిశెట్టి సురేశ్బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వీరు మాట్లాడుతూ, ప్రభుత్వ, బంజరు భూముల ఆక్రమణలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఆడారి అప్పారావు, కోన లక్ష్మణ, కోరిబిల్లి శంకరరావు, గంటా శ్రీరామ్, కొణతాల హరినాథబాబు, సూదికొండ మాణిక్యాలరావు, శేఖరమంత్రి సాయి, తేలయ్యబాబు తదితరులు పాల్గొన్నారు.