ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పన

ABN , First Publish Date - 2022-08-15T05:56:30+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పన

ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పన
మైక్‌ సెట్‌ను బహూకరిస్తున్న జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌

కడ్తాల్‌, ఆగస్టు 14: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను తీర్చిదిద్ది విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తోందని జడ్పీటీసీ జర్పుల దశరథ్‌నాయక్‌ అన్నారు. కడ్తాల్‌లోని కస్తూర్బాగాంధీ బాలికల వి ద్యాలయాన్ని ఆదివారం జడ్పీటీసీ సందర్శించారు. జర్పుల రాధాకృష్ణ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా రూ.15వేలతో సమకూర్చిన మైక్‌ సెట్‌ను వెంకటేష్‌, సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డితో కలిసి ఎస్‌వో అనితకు అందచేశారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పా ఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ హంసమోత్యనాయక్‌, నాయకులు లాయక్‌ అలీ, సేవ్యనాయక్‌, బిక్షపతి, రాంచంద్రయ్య, అంజి, ఇర్షద్‌, మాదారం మహేష్‌ గౌడ్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-15T05:56:30+05:30 IST