30న సులభతర వాణిజ్య ర్యాంకులు
ABN , First Publish Date - 2022-06-27T09:33:23+05:30 IST
సులభతర వాణిజ్యంలో ముందున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను కేంద్ర ప్రభుత్వం మరోసారి జారీ చేయబోతోంది.
న్యూఢిల్లీ: సులభతర వాణిజ్యంలో ముందున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను కేంద్ర ప్రభుత్వం మరోసారి జారీ చేయబోతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 30న ఈ జాబితా విడుదల చేస్తారని సమా చారం. 2019 వరకు కేంద్రం ఏటా ఈ జాబితా విడుదల చేసేది. కొవిడ్తో గత రెండేళ్ల నుంచి ఈ జాబితా విడుదల కాలేదు. గురువారం 2020 సంవత్సరానికి సంబంధించి సులభతర వాణిజ్యంలో ముందున్న రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాం తాల జాబితా విడుదల అయ్యే అవకాశం ఉంది. నిర్మాణ, పర్యావరణ అనుమతులు, కార్మిక చట్టాల అమలు వంటి అంశాల ఆధారంగా డీపీఐఐటీ ఈ జాబితా రూపొందిస్తుంది.