30న సులభతర వాణిజ్య ర్యాంకులు

ABN , First Publish Date - 2022-06-27T09:33:23+05:30 IST

సులభతర వాణిజ్యంలో ముందున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను కేంద్ర ప్రభుత్వం మరోసారి జారీ చేయబోతోంది.

30న సులభతర వాణిజ్య ర్యాంకులు

న్యూఢిల్లీ: సులభతర వాణిజ్యంలో ముందున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను కేంద్ర ప్రభుత్వం మరోసారి జారీ చేయబోతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ నెల 30న ఈ జాబితా విడుదల చేస్తారని  సమా చారం. 2019 వరకు కేంద్రం ఏటా ఈ జాబితా విడుదల చేసేది. కొవిడ్‌తో గత రెండేళ్ల నుంచి ఈ జాబితా విడుదల కాలేదు. గురువారం 2020 సంవత్సరానికి సంబంధించి సులభతర వాణిజ్యంలో ముందున్న రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాం తాల జాబితా విడుదల అయ్యే అవకాశం ఉంది. నిర్మాణ, పర్యావరణ అనుమతులు, కార్మిక చట్టాల అమలు వంటి   అంశాల ఆధారంగా డీపీఐఐటీ  ఈ జాబితా రూపొందిస్తుంది. 

Updated Date - 2022-06-27T09:33:23+05:30 IST