అధ్యక్ష ఎన్నికల్లో అశాంతి నెలకొనకుండా ఫేస్‌బుక్ చర్యలు

ABN , First Publish Date - 2020-09-23T01:30:27+05:30 IST

రికా అధ్యక్ష పదవి ఎన్నికలు నవంబర్ మూడో తేదీన జరగనున్నాయి.

అధ్యక్ష ఎన్నికల్లో అశాంతి నెలకొనకుండా ఫేస్‌బుక్ చర్యలు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు నవంబర్ మూడో తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తితే.. వాటికి సంబంధించిన కంటెంట్‌ను పరిమితం చేసేలా ఫేస్‌బుక్ దూకుడు చర్యలు తీసుకోనుంది. ఎన్నికల రోజు గందరగోళ పరిస్థితి, ప్రజా అశాంతి నెలకొంటే ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై ప్రణాళికలు రూపొందించినట్టు ఫేస్‌బుక్ గ్లోబల్ అఫైర్స్ హెడ్ నిక్ క్లెగ్ తెలిపారు. 


కరోనా నేపథ్యంలో ఈసారి మెజారిటీ అమెరికన్లు మెయిల్-ఇన్(వ్యక్తిగతంగా హాజరుకాకుండా మెయిల్ ద్వారా ఓటు వేయడం) ద్వారా ఓటేయనున్నారు. మెయిల్-ఇన్ ఓట్ల కంటే వ్యక్తిగతంగా హాజరై (ఇన్-పర్సన్) వేసే ఓట్లను వేగంగా లెక్కిస్తారు. దీంతో రాజకీయ సందిగ్దం ఏర్పడితే ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఫేస్‌బుక్ ప్రణాళికలు రూపొందిస్తోంది. కాగా.. రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరోపక్క డెమొక్రటిక్ పార్టీ నుంచి మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష రేసులో ఉన్నారు.

Updated Date - 2020-09-23T01:30:27+05:30 IST