ఫేస్‌బుక్‌కు షాకిచ్చిన కోర్టు.. 650 మిలియన్ డాలర్ల నష్టపరిహారం!

ABN , First Publish Date - 2021-02-28T11:22:52+05:30 IST

ప్రముఖ సోషల్ మీడియా కంపెనీ ఫేస్‌బుక్‌కు అగ్రరాజ్యం అమెరికాలో షాక్ తగిలింది. వ్యక్తిగత గోప్యతకు ఫేస్‌బుక్ భంగం కలిగించిందంటూ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఈ సంస్థ 650 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలంటూ ఆదేశించింది.

ఫేస్‌బుక్‌కు షాకిచ్చిన కోర్టు.. 650 మిలియన్ డాలర్ల నష్టపరిహారం!

వాషింగ్టన్: ప్రముఖ సోషల్ మీడియా కంపెనీ ఫేస్‌బుక్‌కు అగ్రరాజ్యం అమెరికాలో షాక్ తగిలింది. వ్యక్తిగత గోప్యతకు ఫేస్‌బుక్ భంగం కలిగించిందంటూ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఈ సంస్థ 650 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలంటూ ఆదేశించింది. ఫొటోల్లో అనుమతి లేకుండా యూజర్లను ఫేస్‌బుక్ ఫేస్‌ట్యాగ్ చేస్తోందని, ఇది ప్రైవసీ పాలసీని తుంగలో తొక్కడమేనని కొందరు యూజర్లు ఆరోపించారు. ఈ మేరకు 2015లో వేసిన కోర్టు పిటిషన్‌కు 16లక్షల మంది మద్దతుగా నిలిచారు. వీరందరికీ కలిపి 650 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ లెక్కన ఒక్కొక్కరికి 345 డాలర్ల వరకూ వచ్చే అవకాశం ఉంది. ప్రైవసీ పాలసీకి సంబంధించిన కేసుల్లో ఇంత మొత్తంలో సెటిల్‌మెంట్ జరగడం ఇదే తొలిసారని తీర్పిచ్చిన జడ్జి కూడా పేర్కొన్నారు.

Updated Date - 2021-02-28T11:22:52+05:30 IST