ఫేస్‌బుక్‌లో పరిచయమైన పక్కింటి కుర్రాడు.. పెళ్లి పేరు చెప్పి మోసం.. తల్లికి చెప్పడంతో

ABN , First Publish Date - 2022-05-03T09:00:26+05:30 IST

ప్రస్తుతం యువతీ యువకులు అందరూ సోషల్ మీడియాలోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలో కొత్త పరిచయాలు ఏర్పడుతున్నాయి. అయితే ఒక్కోసారి ఈ పరిచయాలు అపాయంగా మారుతున్నాయి...

ఫేస్‌బుక్‌లో పరిచయమైన పక్కింటి కుర్రాడు.. పెళ్లి పేరు చెప్పి మోసం.. తల్లికి చెప్పడంతో

ప్రస్తుతం యువతీ యువకులు అందరూ సోషల్ మీడియాలోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలో కొత్త పరిచయాలు ఏర్పడుతున్నాయి. అయితే ఒక్కోసారి ఈ పరిచయాలు అపాయంగా మారుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఇలాంటి ఘటనేవెలుగు చూసింది. 


స్థానికంగా నివసించే ఒక యువతికి ఫేస్‌బుక్‌లో రిషి అనే యువకుడు పరిచయం అయ్యాడు. అతను తమ లొకాలిటీలోనే ఉంటాడని తెలియడంతో ఇద్దరూ కలిశారు. ఈ క్రమంలోనే ఆమెను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన రిషి.. యువతితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. దీన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆ వీడియో చూపించి ఆమెను నెలల తరబడి బలాత్కరించాడు. ఆమె ఎప్పుడు ప్రతిఘటించినా వీడియో వైరల్ చేసేస్తానని బెదిరించేవాడు. 


చివరకు ఆ యువకుడు పెట్టే చిత్రహింసలు భరించలేక విషయం తన తల్లికి ఆమె చెప్పేసింది. దీంతో ఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న వాళ్లు.. సదరు యువకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

Read more