జూలై 2న సివిల్స్ విజేతలతో ముఖాముఖి

ABN , First Publish Date - 2022-07-01T21:13:11+05:30 IST

తెలంగాణ రాష్ట్ర బిసి స్టడీ సర్కిల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 2న సివిల్ సర్వీసెస్ 2021విజేతలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నామని బిసి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు.

జూలై 2న సివిల్స్ విజేతలతో ముఖాముఖి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బిసి స్టడీ సర్కిల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 2న సివిల్ సర్వీసెస్ 2021విజేతలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నామని బిసి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు. జులై 2వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని ఠాగూర్ ఆడిటోరియంలో 2021 సివిల్స్ విజేతలతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుందన్నారు.  


యూపిఎస్సీ పరీక్ష ల్లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులు  సివిల్స్, గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారి కోసం అవసరమైన సూచనలు సలహాలు ఇస్తారని ఆయన తెలిపారు. సివిల్స్, గ్రూప్ 1,2 రాయాలనుకుంటున్న యువత ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.ఆసక్తి గల యువత 7780359322 నెంబర్ కు ఫోన్ చేసి తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

Updated Date - 2022-07-01T21:13:11+05:30 IST