ఇంట్లో లభించే వీటితో ఇలా చేస్తే చర్మం నిగనిగలాడుతుంది!
ABN , First Publish Date - 2022-02-05T18:30:50+05:30 IST
పెరుగు, శనగపిండి కలిపి ఫేస్ప్యాక్గా ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మృతకణాలు తొలగిపోయి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది
ఆంధ్రజ్యోతి(05-02-2022)
పెరుగు, శనగపిండి కలిపి ఫేస్ప్యాక్గా ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మృతకణాలు తొలగిపోయి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. శనగపిండి క్లీన్సింగ్ ఏజెంట్గా పనిచేస్తే, పెరుగు మాయిశ్చరైజర్గా పనికొస్తుంది. తేనె చర్మాన్ని శుభ్రం చేస్తుంది. పసుపు యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. ఒక బౌల్లో రెండు టేబుల్స్పూన్ల శనగపిండి తీసుకుని అందులో ఒక టేబుల్స్పూన్ పెరుగు, ఒక టీస్పూన్ తేనె, కొద్దిగా పసుపు వేసి మెత్తటి పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా పట్టించాలి. ఆరిన తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.