ఫ పల్లె ప్రగతి సరే..పశువుల తొట్టిని పట్టించుకునేదెవరూ?
ABN , First Publish Date - 2022-06-15T04:31:17+05:30 IST
ఫ పల్లె ప్రగతి సరే..పశువుల తొట్టిని పట్టించుకునేదెవరూ?
బషీరాబాద్, జూన్ 14: పల్లెప్రగతి పనులు ఊరురా కొనసాగుతున్నాయి. ఈ ప్రగతి పనుల్లో భాగంగా పలు గ్రామాల్లో ఇప్పటికే ఓహెచ్ఎ్సఆర్ ట్యాంకులు, మినీ ట్యాంకులు, పశువుల తొట్లను శుభ్రపరిచారు. ఇదిలా ఉండగా బషీరాబాద్ మండలంలోని మల్కన్గిరి గ్రామంలో పశువుల తొట్టి నాచుపట్టి మురుగుకూపంగా మారింది. పల్లెప్రగతి కార్యక్రమంలో అధికారులెవరూ పశువల తొట్టిపై దృష్టి సారించకపోవడంతో ఆ పరిశుభ్రంగా తయారై దర్శనమిస్తోంది.