కరోనా పట్ల అత్యంత జాగ్రత్త అవసరం

ABN , First Publish Date - 2020-07-14T11:44:39+05:30 IST

కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని వైద్యసిబ్బంది ప్రజలకు సూచించారు. సోమవారం మండలంలోని

కరోనా పట్ల అత్యంత జాగ్రత్త అవసరం

లింగాల, జూలై 13: కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని వైద్యసిబ్బంది ప్రజలకు సూచించారు. సోమవారం మండలంలోని లోపట్నూతల గ్రామంలో క రోనా వ్యాప్తి నివారణకు, ఫీవర్‌ సర్వేలో భా గంగా సోమవారం లింగాల పీహెచ్‌సీ వైద్యసిబ్బంది గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. వైద్యశిబిరంలో ప్రజలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు.


ఫీవర్‌ సర్వేలో భాగంగా గ్రామంలో నీటి నిల్వ ప్రాంతాలు గుర్తించి లార్వా నిర్మూలన కోసం అబేట్‌ పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు పరిసరాల పరివుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అ లాగే కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. హెల్త్‌ సూపర్వైజర్‌ ఆసియా బేగం, మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ ప్రి యాంక, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-14T11:44:39+05:30 IST