దాడికి దారితీసిన వివాహేతర సంబంధం

ABN , First Publish Date - 2020-05-29T09:51:43+05:30 IST

తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని కొడుకు గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన మండల

దాడికి దారితీసిన వివాహేతర సంబంధం

ధారూరు: తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని కొడుకు గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన మండల పరిధిలోని గట్టేపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గట్టేపల్లికి చెందిన ఏర్పులా రాములుతో అదే గ్రామానికి చెందిన చిన్నమోముల శేఖర్‌ గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య గొడవ ముదిరి శేఖర్‌ గొడ్డలితో రాములు తలపై కొట్టి తీవ్రంగా గాయపర్చాడు.  రాములు పరిస్థితి విషమంగా ఉంది. కాగా శేఖర్‌ హైదరాబాద్‌లో మెకానిక్‌ పని చేస్తున్నాడు.  లాక్‌డౌన్‌తో ఇటీవల గ్రామానికి వచ్చిన శేఖర్‌ తల్లితో ఉంటున్నాడు.


తన తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న రాములు తనను చంపాలని కుట్ర పన్నుడుతున్నాడన్న అనుమానంతో శేఖర్‌ దాడి చేసినట్లు తెలుస్తుంది. రాములు పరిస్థితి విషమంగా ఉండటంతో మైరుగైన చికిత్స కోసం ఉస్మానియా అసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు తెలిపారు. కరోనా కట్టడి గ్రామంలో సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. 

Updated Date - 2020-05-29T09:51:43+05:30 IST