అతను వివాహితుడు.. ఆమె వితంతువు.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఎంతటి ఘోరానికి దారి తీసిందంటే..

ABN , First Publish Date - 2021-12-13T18:22:02+05:30 IST

ఆమె వితంతువు.. భర్త చనిపోవడంతో ఒంటరిగా నివసిస్తోంది.. తన ఇంటికి సమీపంలో ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

అతను వివాహితుడు.. ఆమె వితంతువు.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఎంతటి ఘోరానికి దారి తీసిందంటే..

ఆమె వితంతువు.. భర్త చనిపోవడంతో ఒంటరిగా నివసిస్తోంది.. తన ఇంటికి సమీపంలో ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. అప్పటికే వివాహితుడైన ఆ వ్యక్తి ఇద్దరు పిల్లలకు తండ్రి.. వివాహితుడైన అతడిని పెళ్లి చేసుకోవాలనుకోవడం ఆమె ప్రాణానికి ముప్పు తెచ్చిపెట్టింది.. పెళ్లి గురించి ఆమె చేస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకపోయిన నిందితుడు ఆమెను కడతేర్చాడు.. గుజరాత్‌లోని లందాపురా గ్రామంలో ఈ ఘటన జరిగింది. 


లందాపురా గ్రామానికి చెందిన హంస పర్మార్ (32) అనే మహిళ భర్తను కోల్పోయి ఒంటిరిగా నివసిస్తోంది. ఆమెకు కొన్ని నెలల కిందట శైలేష్ వాఘేలా అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వివాహితుడైన శైలేష్‌తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతటితో ఆగకుండా తనను పెళ్లి చేసుకోమని శైలేష్‌పై ఒత్తిడి తేవడం ప్రారంభించింది. తనకు ఇద్దరు పిల్లలు కూడా ఉండడంతో శైలేష్ అందుకు అంగీకరించ లేదు. అయినా పర్మార్.. వాఘెలాపై పెళ్లి గురించి మరింతగా ఒత్తిడి తీసుకువచ్చింది.


ఆమెను చంపితేనే తప్ప తనకు మనశ్శాంతి ఉండదని భావించిన శైలేష్ అందుకు పథకం రచించాడు. గ్రామ సమీపంలోని కాలువ వద్ద కలుద్దాం అని పర్మార్‌ని పిలిచాడు. అక్కడ ఆమె గొంతు కోసి చంపి పరారయ్యాడు. కాలువ సమీపంలో పర్మార్ హత్యకు గురైందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమెకు శైలేష్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్టు గుర్తించి అతడిని పిలిచి పోలీసులు విచారించారు. దర్యాఫ్తులో నిందితుడు నిజం ఒప్పుకోవడంతో అతడిని అరెస్ట్ చేశారు. 

Updated Date - 2021-12-13T18:22:02+05:30 IST