తిరుపతి రైలుకు అదనపు కోచ్లు
ABN , First Publish Date - 2022-01-22T06:42:34+05:30 IST
విశాఖ మీదుగా తిరుపతి-పూరి, బిలాస్పూర్-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే రైళ్లకు శాశ్వత ప్రాతిపదికన అదనపు కోచ్లు జత చేస్తున్నట్టు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం తెలిపారు
విశాఖపట్నం, జనవరి 21: విశాఖ మీదుగా తిరుపతి-పూరి, బిలాస్పూర్-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే రైళ్లకు శాశ్వత ప్రాతిపదికన అదనపు కోచ్లు జత చేస్తున్నట్టు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం తెలిపారు. తిరుపతి-బిలాస్పూర్-తిరుపతి (17482/17481) ఎక్స్ప్రెస్ సర్వీసులకు ఈ నెల 23 నుంచి ఒక అదనపు థర్డ్ ఏసీ కోచ్, తిరుపతి-పూరి-తిరుపతి(17480/17479) ఎక్స్ప్రెస్ సర్వీసులకు ఈ నెల 24 నుంచి ఒక అదనపు థర్డ్ ఏసీ కోచ్ జత చేయనున్నట్టు పేర్కొన్నారు.